ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్‌ వైర్‌ బండిల్స్‌లో బంగారం తీసుకువచ్చాడు. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.